ఆరుగురి యువకుల కోరికలు/తెలుగు కథలు/telugu stories

ఆరుగురి యువకుల కోరికలు



            అనగనగా ఒక రాజు అతని దగ్గర ఓ మంత్రి. చుట్టుపక్కల ఆయన దయ దక్షిణాలతో నడిచే ప్రాంతాల నుంచి పన్ను వసూలు చేయడానికి తన మంత్రిని పంపుతుంటాడు. మంత్రి ఒక నలుగురు భటులతో పన్నుల వసులకు పోతుంటాడు.తిరిగి వస్తున్నప్పుడు మంత్రి అతని అంగరక్షకులు ఒక అడవి గుండె రావాల్సి ఉంటుంది. ఒకసారి వీరిలా పనులు వసూలు చేసి వస్తుండగా అడవి మార్గంలో దోపిడీ దొంగలు మంత్రిని భటులను బెదిరించి వారి నుంచి డబ్బులు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మంత్రి మనసులో దేవుడిని ప్రార్థిస్తాడు. తమను కాపాడమని .ఆ ప్రార్ధనలో భగవంతుడు చేవిన పడిందో ఏమోగానీ ఎక్కడినుంచో ఆరుగురు యువకులు అక్కడికి వస్తారు మంత్రిని అతని అంగరక్షకులను కాపాడుతారు మంత్రి ఆ ఆరుగురు యువకులను మెచ్చుకొని తమతో రాజు వద్దకు తీసుకుపోతారు .

రాజుకు కళ్ళకు కట్టినట్లు వివరిస్తాడు మంత్రి రాజు గారిని కొనియాడుతూ,మీరేం కోరుకున్న ఇస్తానని మాట ఇస్తాడు.

మొదటి యువకుడు తనకు బోలెడంత డబ్బు కావాలని కోరుకుంటాడు

రెండో యువకుడు తను తన కుటుంబ సభ్యులు హాయిగా నివసించడానికి ఓ ఇల్లు కావాలని కోరుతాడు

మూడవ అతను తనుంటున్న గ్రామంలో రోడ్లను బాగు చేయాలని కోరుకుంటాడు

నాలుగవ యువకుడు తను ఇష్టపడుతున్న ఓ ధనికుడి కూతురితో వివాహం జరిపించాలని కోరుకుంటాడు

ఐదవ యువకుడు తన తండ్రి చేసిన అప్పులను తీర్చాలని కోరుతాడు

ఐదుగురు యువకులకు వారు కోరుకున్నది ఇస్తానని హామీ ఇస్తాడు రాజు

ఇక ఆరవ యువకుడి వంక చూసి 'నీకేం కావాలి' అని అడుగుతాడు రాజు.యువకుడు అడగడానికి ముందుగా కాస్తంత భయపడతాడు. అయితే రాజు 'ఎటువంటి భయం లేకుండా ఏది కావాలన్నా అడుగు' ఇస్తానంటాడు మాట తప్పని అంటాడు. అప్పుడు ఆ యువకుడు తనకు నగలు నట్రా ఏమి అక్కర్లేదంటాడు. ఏడాదికి ఒకసారి మీరు మా ఇంటికి వచ్చి వారం లేక పది రోజులు ఉండాలి నాకు అంతకన్నా ఏమీ వద్దు అంటాడు.

రాజు ఇంతేగా అంటూ అతని కోరికకు సరేనని ఒప్పుకుంటాడు.అయితే ఆ తర్వాతే ఆ యువకుడి కోరికలో దాగి ఉన్న ఉద్దేశం అర్థమైంది.అవును ఆ నిజమేంటంటే రాజు అతని ఇంటికి వచ్చి ఉండాలంటే అతని ఇల్లు బాగుండాలి. ఆ ఊరికి వెళ్లే రహదారులన్నీ బాగుపడతాయి అలాగే అతను ఉన్న సమయంలో అతని కోసం పనివాళ్ళు కావాలి. ఈ క్రమంలో అతనికి ఓ అర్హత లభిస్తుంది ఇలా ఉండగా మొదటి అయిదుగురు కోరుకున్న వారిని కలిపి ఇతను ఒక్క మాటతో తీర్చబోతున్నాడు తన కోరికను అతను ఉద్దేశాన్ని గ్రహించిన రాజు ఆ యువకుడి తెలివితేటలను గ్రహించి అతనికి తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు.

ఈ కథ వల్ల తెలుసుకోవాల్సిందేమిటంటే రాజే మన పరమాత్మ అనుకుందాం .సహజంగా అయితే అందరూ దేవుడిని కోరుకునేది ఏమిటంటే ఈ ఐదుగురి యువకుల తనకు అది కావాలి ఇది కావాలి అడుగుతారు.దేవుడే మనతో ఉండాలని కోరుకుంటే  అనుకున్నది జరుగుతాయి అని  గ్రహించాలి.





Comments